బ్రహ్మారెడ్డికి బ్రహ్మరథం పట్టిన మల్లవరం,జెట్టిపాలెం గ్రామస్తులు..
మల్లవరం లో 11 కుటుంబాల వారు వైసిపి పార్టీని వీడి బ్రహ్మారెడ్డి సమక్షంలో టిడిపి లోకి చేరారు.
ఐ ఎన్ బి టైమ్స్ రెంటచింతల ఏప్రిల్ 28: రెంటచింతల మండలంలోని మల్లవరం,జెట్టిపాలెం గ్రామాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహించారు ప్రజలు పెద్ద సంఖ్యలో బ్రహ్మరథం పట్టారు.గజమాలతో బాణాసంచా కాల్చుకుంటు, మేళతాళాల నడుమ గ్రామంలోకి ప్రజలు బ్రహ్మారెడ్డి కి స్వాగతం పలికారు.మల్లవరం గ్రామంలో సుమారు 11 కుటుంబాల వారు వైసిపి పార్టీని వీడి కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు.ఆయన మాట్లాడుతు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను, వైసీపీచేస్తున్న దుర్మార్గ పాలనను ప్రజలు గమనించాలన్నారు.కూతవేటులో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉన్న కనీసం గుక్కెడు నీరు కూడా నియోజకవర్గ ప్రజలకు ఇవ్వలేని స్దితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉందన్నారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన,టీడీపీ కూటమి అభ్యర్థులు ఘన విజయాలు పొందుతారన్నారు. ఈ కొద్ది రోజులు నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే మన అందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నియోజకవర్గ లో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించుకుందాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నారు. అనంతరం ఆయా గ్రామాలలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కరపత్రాలను అందించి ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలోమేకల బాల సైదయ్య, దొడ్డ ఎర్రయ్య,షేక్ చిన్న మౌలాలి,కొండా నాయక్,శంకర్ నాయక్, బాలు నాయక్,మేకపోతుల కృష్ణ,మండల అధ్యక్షుడు చపారపు అబ్బిరెడ్డి,వైస్ ఎంపిపి గొంటు సుమంత్ రెడ్డి,మాజీ పిహెచ్సి చైర్మన్ రామకృష్ణ,గొట్టం శీను, ప్రభురాజు తదితరులు పాల్గొన్నారు.
Comment List