రఘునాథపాలెంలో కేంద్ర పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ : అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 01: శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు, ప్రజల భద్రతకు భరోసా కల్పించేలా ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ ప్రసాద్ రావు తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా స్ధానిక పోలీసు, కేంద్ర పోలీసు బలగాలతో రఘునాథపాలెం గ్రామంలో బుధవారం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ మాట్లాడుతూ...లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సాగేలా అవసరమైన ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నాకా బందీ నిర్వహించిన పోలీసులు.. కీలక పాయింట్లపై నిఘా పెట్టి తనిఖీలు ముమ్మరం చేస్తున్నారని అన్నారు.ముందస్తు ప్రణాళికతో క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో కట్టుదిట్టమైన బందోబస్తుకు అవసరమైన సన్నాహాలు చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగానే కమిషనరేట్ వ్యాప్తంగా సెంట్రల్ పోలీస్ ఫోర్స్, స్థానిక పోలీసు సిబ్బంది కలిసి అనేక ప్రాంతాల్లో వీధుల్లో తిరుగుతూ.. ప్రజల భద్రతకు భరోసా కల్పిస్తూనే..ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, అసాంఘిక శక్తులకు సహకరించ వద్దని కోరుతున్నామని అన్నారు.ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా నచ్చిన వ్యక్తికి, ఓటువేసే ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని పెర్కొన్నారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే నేరచరితులను బైండోవర్ చేస్తున్నామని తెలిపారు. అక్రమ మధ్యం, నగదు, కానుకల రవాణాను చెక్ పెట్టేందుకు చెక్ పోస్టుల ద్వారా నియంత్రించే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిర్భయంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు ,బ్లూకోల్డ్ బృందాలు నిరంతరం ప్రజలకు అందుబాటులో వుంటూ విధులు నిర్వహిస్తున్నట్లు పెర్కొన్నారు. కార్యక్రమంలో ఏసీపీ రమణమూర్తి, సిఐలు శ్రీహరి, భానుప్రకాశ్, ఉదయ్ కుమార్ రమేష్ ,సిబ్బంది పాల్గొన్నారు.
/
Comment List