రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్న
రాష్ట్ర నాయకులు ఏడవల్లి కృష్ణ
ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ మే 09: కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం కిన్నెరసాని,రాజపురం గ్రామం లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర నాయకులు ఏడవల్లి కృష్ణ విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు కార్యక్రమములో ఏడవల్లి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందాలంటే,పారిశ్రామికంగా, చదువు కున్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా చెయ్యాలంటే మనం అందరం కూడా హస్తం గుర్తు పై మి అమూల్యమైన ఓటు రామ సహాయం రఘురాం రెడ్డి కి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని తెలిపారు,మోడీ ప్రభుత్వం అర చేతిలో వైకుంఠం చూపిస్తున్నారు తప్ప దేశానికి చేసిన అభివృద్ధి శూన్యం,కాంగ్రెస్ పార్టీ దేశం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత ఉంది ప్రజలారా గమనించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మన జీవితాలు బాగుపడతయని కృష్ణ తెలిపారుఈ కార్యక్రమములో పాల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గద్దల రమేష్ ఏ బ్లాక్ అద్యక్షులు చావా వీరయ్య చౌదరి,ఓబీసీ మండల అధ్యక్షులు కట్ట సోమయ్య,ఓబీసీ టౌన్ అద్యక్షులు చారి,మైనార్టీ జనరల్ సెక్రటరీ హిమని,సాంబయ్య,కుర్స వెంకటేశ్వర్లు,తటి సురేష్,కల్తీ పెదబాబు,రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు
Comment List