రిసిప్షన్ సెంటర్ ఏర్పాట్ల ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్*
ఐ ఎన్ బి టైమ్స్ మహబూబాబాద్ మే 09: సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో బాగంగా మహబూబాద్, డోర్నకల్ రిషిప్సషన్ సెంటర్ల ఏర్పాట్లు, అలాగే మహబూబాబాద్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, 7 నియోజక వర్గాల ఇవియం స్ట్రాంగ్ రూంల పర్యవేక్షణ ఏర్పాట్లను గురువారం రోజున జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్ అదనపు కలెక్టర్ డేవిడ్ లు పర్యవేక్షించారు.ఈ పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూం,సిసి కెమెరాల పనితీరు, వాహనాల పార్కింగ్ తదితర విషయాలను సంబంధిత నోడల్ అదికారులని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ప్రస్తుతం వాతావరణ మార్పులు ఏవిధంగా ఉన్న అందుకు అనుకూలంగా ఉండాలని సంబంధిత నోడల్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డిఓ అలివేలు,జడ్పీ సీఈవో నర్మద మున్సిపల్ కమిషనర్ రవీందర్, డిపిఓ డిడి గ్రౌండ్ వాటర్ సురేష్, ఫిషరీస్ ఏ డి సత్య నాగమణి,
డి సి ఓ ,ఇఇ ఐ డి సి, ఇఇ లు, డి ఇ లు, ఏఇ లు పాల్గొన్నారు.
Comment List