రఘురాం రెడ్డికి భారీ మెజారిటీ అందిద్దాం.. చావా శివరామ కృష్ణ ఆత్మీయ సమావేశంలో మంత్రి పొంగులేటి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 01: ఈ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిద్దాం అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం పోలీస్ హౌసింగ్ కాలనీలో కాంగ్రెస్ జిల్లా నాయకులు చావా శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. అధిక సంఖ్యలో హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..ప్రజా సేవ కోసం ఎంపీ గా పోటీ చేస్తున్నారని, అంతా ఆదరించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ముమ్మరంగా పనిచేయాలని కోరారు. సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు హాజరై.. రఘురాం రెడ్డి కోసం ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, విద్యా, మౌలిక వసతుల చైర్మన్ మువ్వా విజయ్ బాబు, డాక్టర్ ఎంఎఫ్.గోపీనాథ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, నగర అధ్యక్షులు మహ్మద్ జావేద్, సీనియర్ నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, మద్దినేని స్వర్ణ కుమారి, ఎంపీపీ మంగీ లాల్ తదితరులు పాల్గొన్నారు.
Comment List