రఘురాం రెడ్డికి భారీ మెజారిటీ అందిద్దాం.. చావా శివరామ కృష్ణ ఆత్మీయ సమావేశంలో మంత్రి పొంగులేటి

రఘురాం రెడ్డికి భారీ మెజారిటీ అందిద్దాం.. చావా శివరామ కృష్ణ ఆత్మీయ సమావేశంలో మంత్రి పొంగులేటి

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 01: ఈ లోక్ సభ ఎన్నికల్లో  కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిద్దాం అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం పోలీస్ హౌసింగ్ కాలనీలో కాంగ్రెస్ జిల్లా నాయకులు చావా శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు.  అధిక సంఖ్యలో హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..ప్రజా సేవ కోసం ఎంపీ గా పోటీ చేస్తున్నారని, అంతా ఆదరించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ముమ్మరంగా పనిచేయాలని కోరారు. సీపీఎం రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు హాజరై.. రఘురాం రెడ్డి కోసం ఓట్లు అభ్యర్థించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, విద్యా, మౌలిక వసతుల చైర్మన్ మువ్వా విజయ్ బాబు, డాక్టర్ ఎంఎఫ్.గోపీనాథ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గాప్రసాద్, నగర అధ్యక్షులు మహ్మద్ జావేద్, సీనియర్ నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, మద్దినేని స్వర్ణ కుమారి, ఎంపీపీ మంగీ లాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 45

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి