తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం..
- కైకొండాయిగూడెం ఆత్మీయ సమ్మేళనంలో రఘురాం రెడ్డి - కేంద్రంలో కాంగ్రెస్ రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించండి: ప్రసాద్ రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: నాడు ఎన్నో త్యాగాలు చేసి, తెలంగాణ సాధనకు కృషి చేసిన పోరాట యోధులందరికీ అండగా ఉంటామని కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. బుధవారం కైకొండాయిగూడెం వద్ద నిర్వహించిన ఉద్యమ యోధుల ఆత్మీయ సమ్మేళనoలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డితో కలిసి ప్రసంగించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమాన్ని విస్మరించిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో అన్ని రకాల సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని అభయ మిచ్చారు.
మీ సేవలు అమూల్యం: పొంగులేటి ప్రసాద్ రెడ్డి
ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుల పాత్ర ఎంతో కీలకమైందని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందామని పల్లె పల్లెనా ప్రచారం చేయాలని, రఘురాం రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేవీ. కృష్ణా రావు, ఉద్యమకారులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comment List