స్ట్రాంగ్ రూం ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
ఐ ఎన్ బి టైమ్స్ మహబూబాబాద్ మే 07 : సోమవారం రోజున సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం ను జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ రాంనాథ్ కెకన్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పరిశీలించారు. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాల స్ట్రాంగ్ రూం ను,డిస్ట్రిబ్యూషన్ సెంటర్,రిసెప్షన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూం నిర్వహణ, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటిస్తూ ఎన్నికల నియమావళి ననుసరించి అన్ని ఏర్పాట్లు పకడ్బందీ గా జరగాలని సంబంధిత ఎన్నికల నోడల్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం.డేవిడ్,ఆర్డీవో అలివేలు, ఏ ఎస్పీ చెన్నయ్య,డిప్యూటీ సిఇఓ నర్మద,డిపిఓ హరిప్రసాద్,డి హెచ్ ఎస్ ఓ మరియన్న,గ్రౌండ్ వాటర్ డి డి సురేష్ ,మహబూబాబాద్ తహశీల్దార్ భగవాన్ రెడ్డి , సంబంధిత నోడల్ అధికారులు పాల్గొన్నారు.
Comment List