సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
స్వాగతించిన ఉమ్మడి టిడిపి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ
ఐ ఎన్ బి టైమ్స్ కాకినాడ జిల్లా కిర్లంపూడి మే 09: కిర్లంపూడి మండలం ముక్కోల్లు గ్రామంలో టిడిపి సీనియర్ నాయకులు బస్వా వీరబాబు స్వగృహం నందు సూరంపాలెం టిడిపి నాయకులు పోసిన బాబురావు ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాదిగ దండోరా 40 కుటుంబాల వారు వైసీపీకి రాజీనామా చేసి జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో టిడిపిలో చేరారు. వీరికి నెహ్రూ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఎన్నికల్లో దళితుల ఓట్లతో గద్దెనెక్కి ఈ వైసీపీ ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపించిందని దళితులను అవమానపరిచిన ,హత్యలు చేసిన, అత్యాచారాలు చేసిన వారిని అందలం ఎక్కించిందని దళితుల 27 పథకాలు రద్దుచేసి ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా పక్కదారి మళ్లించిన ఘనత ఈ ముఖ్యమంత్రి చెందుతుందని దళిత ద్రోహి జగన్ రెడ్డిని ఓడించి చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉమ్మడి ప్రభుత్వం రావడానికి జ్యోతుల నెహ్రూ కి సైకిల్ గుర్తుపైన, ఎంపీ అభ్యర్థి టీ టైం ఉదయ్ కి గాజు గ్లాస్ గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కుంచే రామకృష్ణ, గల్లా కృష్ణ మాధవ్, మేడిశెట్టి నారాయణరావు, తాతపూడి బాబురావు తదితరులు పాల్గొన్నారు.
Comment List