బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే..

నామా..కేంద్ర మంత్రి ఎలా అవుతాడో చెప్పాలి ..? * మధిర కాంగ్రెస్ నియోజకవర్గ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి భట్టి, పొంగులేటి

బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటే..

ఐ ఎన్ బి టైమ్స్ మధిర ఏప్రిల్ 30: బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం లాంటిదని..రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి విమర్శించారు.  మంగళవారం మధిర మండలం దెందుకూరు శ్రీరస్తు కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ సమావేశం లో మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రామ సహాయం రఘురాoరెడ్డికి భారీ మెజారిటీ అందించాలని కోరారు. ఖమ్మం పర్యటలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి నామా గెలిస్తే కేంద్రంలో మంత్రి అవుతాడని ప్రకటించారని, నామానీ ఎలా మంత్రిని చేస్తారో కేసీఆర్ వివరించాలని ప్రశ్నించారు.  కాంగ్రెస్ మండలాధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు రాయల నాగేశ్వరరావు,  జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సీనియర్ నాయకులు ఐలూరి వెంకటేశ్వర రెడ్డి, మద్దినేనీ స్వర్ణ కుమారీ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కోటా రాంబాబు,  ఎంపీపీ మెండెం లలిత తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 21

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి