సమోసాలు కాల్చి..ఓట్లు అభ్యర్థించి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి వినూత్న ప్రచారం
On
ఐ ఎన్ బి టైమ్స్ చింతకాని ఏప్రిల్ 30:"అమ్మా..బావున్నారా?. వ్యాపారం ఎలా నడుస్తోంది.. గిట్టుబాటు అవుతోందా.." అంటూ కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి నాగులవంచ గ్రామంలో ఓ చిరు వ్యాపారి మహిళ తో ఇలా ముచ్చటించారు. ప్రచారంలో భాగంగా..రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తో కలిసి మంగళవారం సాయంత్రం ఇక్కడ ఆగి..టిఫిన్ సెంటర్ వద్దకు వెళ్ళారు. స్వయంగా ఆయనే కడాయిలో సమోసాలు వేసి..కాల్చారు. అక్కడే బజ్జీలు కొని తిన్నారు. మంత్రి పొంగులేటి, రఘు రాం రెడ్డి మాట్లాడుతూ.. హస్తం గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీ అందించాలని కోరారు.
Tags:
Views: 32
Latest News
కదం తొక్కిన రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు ఘనంగా సత్తెనపల్లి రామకృష్ణ భవన్ ప్రారంభం
20 May 2024 13:17:13
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19, : సిపిఎం ఖానాపురం హవేలీ కమిటీ నూతన కార్యాలయ భవనం ‘‘కామ్రేడ్ సత్తెనపల్లి రామకృష్ణ భవన్’’ ప్రారంభోత్సవ...
Comment List