ఓయో లాడ్జిలో లవర్స్ .. ప్రియుడు అనుమానాస్పద మృతి
ఐ ఎన్ బి టైమ్స్ హైదరాబాద్ మే 01: ప్రియురాలితో కలిసి ఓయో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఎస్ ఆర్ నగర్ ఠాణా పరిధిలో జరిగింది.ఎస్సై శ్రావన్ కుమార్ వివరాల ప్రకారం.మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన హేమంత్ (28) ఇటుకల వ్యాపారి.అదే ప్రాంతానికి చెందిన యువతి(27)తో ఏడేళ్ల కిందట పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా జర్నీ నడుస్తుంది ఇద్దరూ కలిసి సోమవారం నగరంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై రాత్రి ఎస్ ఆర్ నగర్ లోని ఓయో టౌన్ హౌస్ లో గది తీసుకొని బస చేశారు. మద్యం తాగి రాత్రి 2 గంటల ప్రాంతంలో బాత్రూంకు వెళ్లిన హేమంత్.ఎంతకు బయటకు రాకపోవడంతో యువతి చూడగా అపస్మారకస్థితిలో వున్న హేమంత్.దీంతో యువతి హేమంత్ స్నేహితులకు చెప్పడంతో వారు వచ్చి హేమంత్ ను మంచంపై పడుకోబెట్టి 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు . అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి అప్పటికే హేమంత్ మృతి చెందినట్టు నిర్ధారించారని సమాచారం మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ హేమంత్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comment List