నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాం

* రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి * నేలకొండపల్లి లో రఘురాం రెడ్డితో కలిసి ప్రచారం

నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాం

ఐ ఎన్ బి టైమ్స్ నేలకొండపల్లి మే 01: నిరంతరం ప్రజా సేవ చేస్తామని, అన్నా అంటే అండగా నిలుస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం నేలకొండపల్లి లో ప్రధాన సెంటర్ లో కాంగ్రెస్ లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి తో కలిసి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలం లోనే ఆరు గ్యారెంటీ ల్లో ఐదు  అమలు చేస్తోన్నదని అన్నారు. త్వరలోనే రైతులకు రెండు లక్షల రుణమాఫీ వర్తిస్తుందని ప్రకటించారు. పదేళ్లు పాలించి ప్రజా సమస్యలు పట్టించుకోని బీఆర్ఎస్, మత విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ నీ నమ్మొద్దని కోరారు. రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీలు డ్రామాలడుతూ తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు.
మీ వాడిని..ఆదరించండి..: 
నేను మీ వాడినని... చేగొమ్మ స్వగ్రామం అని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. ఎంపీగా జిల్లా ప్రజలకు మంచి సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:
Views: 13

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి