మతతత్వ బిజెపి అహంకార బిఆర్ఎస్ లను ఓడించండి
ఓయూ జేఏసీ చైర్మన్ పూసల రమేష్ . కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డికి ఓయూ జెఏసి సంపూర్ణమద్దతు
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 01 : మతతత్వ బిజెపిని, ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన బిఆర్ఎస్ లను ఓడించాలని ఓయూ జేఏసీ, టిఎస్ జేఏసీ చైర్మన్ పూసల రమేష్ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓయూ జేఏసీ, టిఎస్ జేఏసీ నేతలతో పాటు టీపీసీసీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మండ్ల రవి మాట్లాడుతూ... దేశంలో నరేంద్ర మోడీ మత రాజకీయాలు, తెలంగాణ రాష్ట్ర పాలనలో నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తానని ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలుచేసి మోసం చేసిన కేసీఆర్ ను ఓడించి, రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ.. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ జిల్లా అనేవిధంగా రఘురాంరెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ పది ఏండ్లలో చేసిన మోసాలను విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు గుర్తించుకొని ఓటెయ్యాలని ఓయూ జేఏసీ, టిఎస్ జేఏసీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ శ్రీను, మధు, లాల్, విజయ్, ఎంఎస్పీ నాయకులు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List