ప్రజా సేవే నా లక్ష్యం
ఈత మిత్రుల ఆత్మీయ సమ్మేళనంలో రఘురాం రెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం రూరల్ మే 02: ప్రజా సేవ కోసమే ఎంపీ గా పోటీ చేస్తున్నా అని, భారీ మెజారిటీతో గెలిపించాలని సీపీఎం, సీపీఐ బలపర్చిన కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. గురువారం పోలేపల్లి లో స్విమ్మర్స్ అసోసియేషన్ సమావేశానికి హాజరై ప్రసంగించారు. తన తండ్రి సురేందర్ రెడ్డి సుధీర్ఘ కాలం కాంగ్రెస్ ప్రజా ప్రతినిధిగా ఉన్నారని తెలిపారు. పూర్తిగా అందుబాటులో ఉండి..జిల్లా మంత్రులు, రాజ్యసభ సభ్యురాలితో కలిసి సుపరిపాలన అందిస్తా అని అన్నారు. ఈ సందర్భంగా ఈత మిత్రులు రఘు రాం రెడ్డిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ళ దుర్గా ప్రసాద్, సీనియర్ నాయకులు మద్దీనేని స్వర్ణ కుమారీ, నగర అధ్యక్షులు మహ్మద్ జావేద్, మహిళా జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, నాయకులు కొప్పుల చంద్ర శేఖర్, లెఫ్ట్ కెనాల్ సిమ్మర్స్ అసోసియేషన్ బాధ్యులు మన్నె నరసింహా రావు, నాగoడ్ల నరేందర్, లాయర్ గోవిందరావు, కల్వకుంట్ల గోపాల్ రావు, మాధవ రావు తదితరులు పాల్గొన్నారు.
Comment List