బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
బి ఎల్ ఎఫ్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి ఆంతోని సురేష్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ అభ్యర్థి ఆంతోని సురేష్ విజయాన్ని కాంక్షిస్తూ పూలే అంబేడ్కర్ అధ్యయన వేదిక ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బహుజన కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.పర్వతాలు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న పార్టీలన్నీ మతోన్మాద, కుల ఉన్మాద పార్టీలే అని అన్నారు. 65 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో దళిత బహుజన జాతులకు ఒరిగేదేముందని. కుల గణన చెయ్యకపోవటమేనక కాంగ్రెస్, బిజెపి కుట్ర దాగి ఉందని అణగారిన కులాలకు ఆర్థిక రాజకీయ హోదా తగ్గుతుంది అని. వారినిమభ్యపెడుతు వారి ఓట్లతో గద్దెనెక్కుతూ ఎనలేని సంపదను పోగు చేసుకుని 80 శాతం ఉన్న ప్రజలకు పేదరికాన్ని మిగిల్చారు... అందుకే ఈ అగ్రవర్ణ పార్టీలు బహుజన జాతులకు చేసింది ఏమి లేదని అన్నారు. అందుకే దళిత బహుజన రాజ్యం కోసం బహుజన మేధావర్గం ఆలోచన చేయాలని .బహుజన రాజ్యం రావాలంటే బహుజన అభ్యర్థులను గెలిపించుకొని పార్లమెంటుకు పంపడం వల్లనే మన సమస్యలు పరిష్కారమైతాయని అని అన్నారు.. పార్లమెంట్ అభ్యర్థి ఆందోళన సురేష్ మాట్లాడుతూ ఎస్సీ లోని ఉపకులమైన డక్కలి కులానికి చెందినవాడినని నాకు ప్రజలు పడే బాధలు కష్టాలు కన్నీళ్లు తెలుసుకొని నన్ను పార్లమెంటుకు పంపితే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీల బతుకులు మార్పు కొరకు గల విప్పుతానన్నాని అన్నారు.. బహుజన కమ్యూనిస్టు పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి పోడకండి రాంబాబు మాట్లాడుతూ కారంచెడులో దళితుల్ని చంపిన కమ్మ కులపు నెత్తురు చుండూరులో దళితుల్ని చంపిన రెడ్ల నెత్తురు సంబంధించిన అభ్యర్థులే ఖమ్మం గడ్డమీద పోటీ పడుతున్నారు. మన అయ్యలను అన్నలను చంపిన ఈ దుర్మార్గపు కులాల అభ్యర్థులను రాజకీయ సమాధి కట్టెందుకు దళిత బహుజనులు ఆలోచన చేయాలి.. టిఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే వారి ఆస్తులు వారి కులాన్ని కాపాడుకుంటారు.. బహుజన బిడ్డ ఆంథోనీ సురేష్ ఓటేస్తే బహుజన గొంతుకై నిలుస్తాడు ... 100 ఏళ్లుగా కమ్మలు, రెడ్లు చేసిన ఆర్థిక దోపిడీ పేద ప్రజలకు జాతీయం చేసేందుకు బహుజనులు ఐక్యమై బహుజన రాజ్యం సాధించుకుందాంము అన్నారు.మాల హక్కుల పోరాట సమితి మాల గుతుపదెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ధార వెంకయ్య మాట్లాడుతూ మాల జాతి ప్రజలందరూ ఖమ్మం నియోజకవర్గం బిఎల్ఎఫ్ పార్టీ అభ్యర్థి ఆంటోనీ సురేష్ కు మొదటి ఇవ్వాలని కోరారు.. డక్కలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కర్నే రామారావు మాట్లాడుతూ మా కులాన్ని గుర్తించిన బహుజన కమ్యూనిస్టు పార్టీకి అభినందనలు తెలియజేస్తూ కత్తెర గుర్తుపై అన్ని బహుజన కులాలు వారు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో మారేలు దానెలు, మధు, సత్యవతి, తోటపల్లి శ్రీను తదిరులు పాల్గొన్నారు...
Comment List