ప్రచారంలో దూసుకుపోతున్న వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య

ప్రచారంలో దూసుకుపోతున్న వరంగల్ పార్లమెంట్  కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య

ఐ ఎన్ బి టైమ్స్ వరంగల్ మే 03:వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి డా. కడియం కావ్య  శుక్రవారం వరంగల్ ఓసిటీ గ్రౌండ్ లో, వరంగల్ ఫోర్ట్ గ్రౌండ్‌లో వాకర్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయాన్నే గ్రౌండ్‌ వద్దకు వెళ్లి వాకర్లు, ఎంప్లాయిస్, రిటైర్డ్ ఎంప్లాయిస్, సీనియర్ సిటిజన్లు, యువతను కలిశారు. వారితో కలిసి వాకింగ్ చేశారు. క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం అక్కడి కూరగాయలు అమ్మే వ్యాపారులతో  ముచ్చటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి డా. కడియం కావ్య  మాట్లాడుతూ...  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, రాహుల్ గాంధీ నేతృత్వంలో పాంచ్ గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు. ఎంపీగా తనను ఆశీర్వదిస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుందామని స్పష్టం చేశారు. యువత ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానికప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 8

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 19 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్...
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
చదువులో ఇద్దరూ సరస్వతీ పుత్రికలే..! అక్క బాటలో చెల్లి.. తల్లి, తండ్రి తోడ్పాటుతో విద్యలో రాణిస్తున్న కాంపెల్లి సిస్టర్స్
ఖమ్మం జిల్లాలో ఆస్తి కోసం తల్లిని ఇద్దరు కూతుర్లను హత్య చేసిన కసాయి తండ్రి