మతతత్వ పార్టీ బిజెపిని ఓడించాలి..- కృష్ణ మాదిగ వైఖరిని ఖండిస్తున్నాం - రాజ్యాంగాన్ని ప్రసాదించేందే కాంగ్రెస్ - పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి

కాంగ్రెస్ రాష్ట్ర నాయుకులు పిడమర్తి రవి, వక్కలగడ్డ సోవుచంద్రశేఖర్

మతతత్వ పార్టీ బిజెపిని ఓడించాలి..- కృష్ణ మాదిగ వైఖరిని ఖండిస్తున్నాం - రాజ్యాంగాన్ని ప్రసాదించేందే కాంగ్రెస్ - పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మే 09 ః మతోన్మాద పార్టీ బిజెపిని ఈ ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయుకులు పిడమర్తి రవి, వక్కలగడ్డ సోమ చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని ప్రసాదించి బహుజనులకు రిజర్వేషన్లు, హక్కులను కల్పించింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. దళితులు, గిరిజనులు, వైునార్టీలకు, బహుజనులకు హక్కుల్లేకుండా చేయాలని బిజెపి చూస్తోందన్నారు. మనువాద పార్టీ బిజెపికి ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపకులు కృష్ణ మాదిగ మద్దతు ఇవ్వడాన్ని ఖండించారు. పదేళ్లు కేంద్రంలో అధికారంలోకి ఉండి ఎస్‌సి వర్గీకరణ చేయకుండా కాలయాపన చేసిన బిజెపిని ఓడించాలన్నారు. మాదిగలకు సరైన ప్రాధాన్యత ఇస్తామని సిఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఖమ్మం పార్లమెంట్‌లో మూడు లక్షలకు పైగా మాదిగలు ఉన్నారన్నారు. గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో మాదిగ జనాభా ఉందన్నారు. రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో మాదిగలకు రాజకీయంగా న్యాయం చేస్తామని సిఎం చెప్పారన్నారు. అందుకే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి కి ఓటు వేసి గెలిపించి పార్లమెంట్‌లో ఎస్‌సి వర్గీకరణ జరిగేందుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య, మహా ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ముత్తపాక నర్సింహారావు, మాదిగ జెఏసి రాష్ట్ర నాయకులు మోదుగు జోగారావు, తెలంగాణ దళిత బహుజన సమితి రాష్ట్ర కన్వీనర్ గజ్జెల్లి మల్లిఖార్జున్, మాదిగ విద్యార్థి ఓయూ జెఏసి ప్రెసిడెంట్ జోగు గణేష్, కాంగ్రెస్ మధిర నాయకులు బొబ్బిళ్లపాటి బాబూరావు, తెలంగాణ మాదిగ విద్యార్థి జెఏసి రాష్ట్ర కన్వీనర్ మీసాల మహేష్, ఓయూ జెఏసి విద్యార్థి నాయకులు దేవరకొండ నరేష్, మాదిగ జెఏసి రాష్ట్ర నాయకులు మురళీ, ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 9

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య   సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్ నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 19:-  పేద ప్రజల పెన్నిధి, కార్మిక పక్షపాతి, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య...
కదం తొక్కిన రెడ్‌ షర్ట్‌ వాలంటీర్ల కవాతు ఘనంగా సత్తెనపల్లి రామకృష్ణ భవన్‌ ప్రారంభం
కేటీఆర్ పర్యటన ను విజయవంతం చేయాలి
సుందరయ్య 39వ వర్ధంతి సభలో నున్నా
రామయ్యా.. నేనున్నానయ్యా
- మీ ఇంటి పెద్ద కొడుకుగా ఉండి... మీ కష్ట సుఖాలను పంచుకుంటా..! అభివృద్ధిని చేతల్లో చూపిస్తా...! మాటలు చెప్పడం నాకు తెలీదు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన