రఘురాం రెడ్డిని ఆదరించి.. కాంగ్రెస్ కే జై కొడదాం
త్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి . అందరికీ లబ్ధి కలిగేలా పథకాల అమలు: పొంగులేటి ప్రసాద్ రెడ్డి . పెనుబల్లిలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రోడ్ షోకు విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ పెనుబల్లి మే 03 : ప్రజాసేవ కోసం లోక్ సభకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. శుక్రవారం పెనుబల్లి మండల కేంద్రంలోని వీ ఎం బంజర రింగ్ సెంటర్ లో అభ్యర్థి రఘురాం రెడ్డి తో కలిసి రోడ్ షో నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు విశేషంగా తరలివచ్చి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాఘమయి మాట్లాడుతూ.. బీ ఆర్ ఎస్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు. మాటలతో వాళ్లు ఇంతకాలం మోసం చేశారని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం పోటీ చేసిన తనను ఇక్కడి ప్రజలు ఆదరించి, అక్కున చేర్చుకున్నారని.. అలాగే రఘురాం రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జాతీయస్థాయిలో మన గళం వినిపించేలా అన్న నిలబడతారని అభయమిచ్చారు.
ఆదర్శంగా మన పథకాల అమలు : పొంగులేటి ప్రసాద్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం.. అన్నింటినీ అమలు చేసే చర్యలు చేపట్టిందని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అన్నారు. మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, రైతుబంధు అమలవుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వానికి భిన్నంగా ప్రజా సంక్షేమ పాలన అందుతోoదని వివరించారు. నిరంతరం ప్రజలతోనే ఉంటా: రఘురాం రెడ్డి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని, ఎంపీగా నిరంతరం ప్రజలతోనే ఉండి సేవలు అందిస్తానని కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి అన్నారు. మత తత్వ బీజేపీని, ప్రజలను మరచిన బీర్ఆర్ఎస్ ను నమ్మొద్దని అన్నారు. ఈనెల 13న జరిగే ఎన్నికల్లో అంతా హస్తం గుర్తుపై ఓటేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో.. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, మట్టా దయానంద్, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Comment List