కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు.
ఐ ఎన్ బి టైమ్స్ కొత్తగూడెం మే 09: లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ గ్రామపంచాయతీకి చెందిన లగడపాటి రమేష్ చంద్, తేలిక పుల్లయ్య, గంపల రవీందర్, సుజాతనగర్ మండలం కోమటిపల్లి గ్రామపంచాయతీకి చెందిన మూడ్ భీమ్లా, కొర్ర శ్రీను, బాబూలాల్, కొత్తగూడెం మున్సిపాలిటీ 28, 30వ వార్డులకు చెందిన దాసరి శ్రీను, జె శ్రీనివాస్, తాడూరి రుక్మిణి, కోరి దేవి, సాగరపు వెంకటలక్ష్మి నేతృత్వంలో మూడు ప్రాంతాలకు చెందిన 130 కుటుంబాలు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా సమక్షంలో గురువారం 'శేషగిరిభవన్'లో జరిగిన సమావేశంలో సిపిఐలో చేరారు, వీరికి పార్టీకండివా కప్పి ప్రాధమిక సభ్యత్వాన్ని నాయకులు అందజేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ఉంటూ సేవలందించే పార్టీలనే ప్రజలు ఆదరిస్తారని, సిపిఐ సేవలను గుర్తించి ఇటీవల వందలాదిమంది వివిధ పార్టీల నుంచి సిపిఐలో చేరారని, వారి నమ్మకానికి అనుగుణంగా సమస్యల పరిస్కారంకోసం కృషిచేస్తామని అన్నారు. ప్రజా సమస్యల పరిస్కారమే సిపిఐ ఏకైక అజెండా అని అందుకోసం ఎలాంటి త్యాగానికైనా వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, వాసిరెడ్డి మురళి, భూక్యా దస్రు, జక్కుల రాములు, పిడుగు శ్రీనివాస్, మాచర్ల శ్రీనివాస్, పల్లపోతు సాయికుమార్, తాళ్ల వెంకటేశ్వర్ రావు, యూసఫ్, బానోత్ గోవిందు, బత్తుల సురేష్, నేరెళ్ల రమేష్, రత్నకుమారి, భూక్యా శ్రీను, మంగియా తదితరులు పాల్గొన్నారు.
Comment List