అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఖానాపూరం హావేలీ రోడ్డు షోలో నామ నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర
On
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు వేసి, బ్రహ్మoడమైన మెజార్టీతో తనను గెలిపించి, పార్లమెంట్ కు పంపాలని బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం ఖానాపురం హావేలీలో గురువారం రాత్రి జరిగిన భారీ రోడ్డు షోలో నామ మాట్లాడారు. అన్నింటా నెంబర్ వన్ గా ఉండే తన పేరు బ్యాలెట్ పేపర్ లో కూడా నెంబర్ వన్ అని తెలిపారు. ఓటు అడగడానికి వచ్చే కాంగ్రెస్ వారిని ఇచ్చిన హామీలపై నిలదీయాలన్నారు. తనను గెలిపిస్తే తెలంగాణా గొంతుకనై పార్లమెంట్ లో పెద్ద ఎత్తున గళం ఇప్పుతానని చెప్పారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, కూరాకుల నాగభూషణం, బచ్చు విజయకుమార్,కోటి, జ్యోతిరెడ్డి, వలరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Views: 12
About The Author
Related Posts
Post Comment
Latest News
నిరంతర స్ఫూర్తి ప్రదాత పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్
20 May 2024 13:22:31
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 19:- పేద ప్రజల పెన్నిధి, కార్మిక పక్షపాతి, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య...
Comment List