మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మహిళలు సమాజానికి రోల్ మోడల్స్ గా ఉండాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా

మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఐ ఎన్ బి టైమ్స్ భద్రాద్రి కొత్తగూడెం మార్చి 05: మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా  పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు అభివృద్ధికి విద్యా ప్రధానమైనది అన్నారు. విద్యావంతురాలు అయిన అన్ని రంగాల్లోనూ తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకొని  ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. మహిళల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, సంక్షేమ కార్యక్రమాలన్నీ మహిళా పేరు మీదే మంజూరు చేస్తుందన్నారు. పనిచేసే మహిళలు  సమాజానికి రోల్ మోడల్స్ అని జిల్లా కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. డి ఆర్ డి ఓ  విద్యాచందన మాట్లాడుతూ మహిళల పట్ల లింగ వివక్ష నిర్ములకు కుటుంబ వ్యవస్థ నుండే ప్రారంభం కావాలని, ఎందుకు తల్లిదండ్రుల మైండ్ సెట్ మారాలని  అన్నారు. పనిచేసే మహిళలపై ఎటువంటి దాడులు జరగకుండా ఉండేలా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. మహిళా శిశు సంక్షేమ అధికారి విజేత మాట్లాడుతూ  మహిళలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి చెందాలంటే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లల పట్ల స్నేహ పూర్వక వాతావరణం కలిగి ఉండేలా చూడాలన్నారు. ఎన్సిఢీ ప్రాజెక్టు ద్వారా" భేటీ బచావో... భేటీ పడావో.. " నినాదంతో బడి ఈడు బాలికలు తప్పనిసరిగా బడిలో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు, ఉద్యోగాలలో కూడా మహిళలు తమదైన శైలిలో పనిచేసే మన్ననలో పొందాలన్నారు.ఈ కార్యక్రమంలో  విద్యాశాఖ జండర్ ఈక్విటీ అధికారి  అన్నామని  సిడిపివోలు, కనకదుర్గ, జ్యోతి, లక్ష్మీ ప్రసన్న, సులోమి, రూప, మహిళా సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 11

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం