కబ'ఢీ' షురూ...! - అంతర్ జిల్లాల స్థాయిలో పోటీల నిర్వహణ - కబడ్డీ కూతతో పోటీలను ప్రారంభించిన దయాకర్ రెడ్డి
కబడ్డీ కూతతో పోటీలను ప్రారంభించిన దయాకర్ రెడ్డి
By INB
On
ఐ ఎన్ బి టైమ్స్ కూసుమంచి ఏప్రిల్ 15 : శ్రీరామనవమికి మూడురోజుల ముందే పాలేరు నియోజకవర్గంలో ఆహ్లాద వాతావరణం నెలకొంది. కూసుమంచి మండలం జీళ్లచెర్వుకు చెందిన పొంగులేటి యువసేన కమిటీ ఆధ్వర్యంలో అంతర్ జిల్లాల స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలను మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి కబడ్డీ కూత కూసి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సీతారామ చంద్రస్వామి వారి కల్యాణ మహెూత్సవాన్ని పురస్కరించుకుని గ్రామీణ క్రీడ కబడ్డీకి తొలి ప్రాధాన్యత ఇస్తూ పోటీలకు శ్రీకారం చుట్టిన కమిటీ సభ్యులను అభినందించారు. ఆహ్లాద వాతావరణంలో పోటీలను ముగించాలని కోరారు. పీఎస్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ తరుపున గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం ఉంటుందని దయాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.
Tags:
Views: 3
About The Author
Related Posts
Post Comment
Latest News
రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్న
09 May 2024 13:42:59
ఐ ఎన్ బి టైమ్స్ పాల్వంచ మే 09: కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ మండలం కిన్నెరసాని,రాజపురం గ్రామం లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామ...
Comment List