వైసిపి పార్టీ‌ ఊరేగింపు కార్యక్రమంలో క్రేన్ తగిలి టిడిపి కార్యకర్త మృతి

వైసిపి పార్టీ‌ ఊరేగింపు కార్యక్రమంలో క్రేన్ తగిలి టిడిపి కార్యకర్త మృతి

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ఏప్రిల్ 15 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం లోని అంబేద్కర్ సెంటర్ లో ఆదివారం రాత్రి ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి  ఊరేగింపు కార్యక్రమంలో   క్రేన్ తగిలి టీడీపీ కార్యకర్త ఆలేటి సాలోమన్(46) అక్కడికక్కడే  మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి  జరిగిన సంఘటన తెలుసుకొని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ..వైసీపీ ఊరేగింపు లో కూడా మా రక్త తిలకం కావలేమో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి మృతుడి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని. గతంలో కంభంపాడు  వద్ద నా కాన్వాయ్ లో ఒక వాహనం ఆటోను ఢీ కొని, ఒకరికి స్వల్పగాయాలు అయితే నాపైన ఎస్సి,ఎస్టీ,హత్యాయత్నం కేసులు పెట్టించారు.మీలా నీచ రాజకీయాలు చేయాలని మేము అనుకోము,మీ విజ్ఞతకే వదిలేస్తున్నామని సాలోమన్ కుటుంబానికి అండగా ఉంటానని,అతని పిల్లలను చదివించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Tags:
Views: 86

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ ప్రతినిధి మే 09 : మాచర్ల నియోజకవర్గం,మాచర్ల మండలం,కొత్తపల్లి, ద్వారకాపురి, రేగులవరం తండా, లచ్చంబాయి, అచ్చమ్మకుంట, సుబ్బారెడ్డి పాలెం,...
మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..: కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ - కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి
రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్న
రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు. రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం. బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే.
తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం..
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి