నీటి సమస్యను పరిష్కారం చేయాలంటున్న మాచర్ల ప్రజలు
స్పందించని పురపాలక అధికారులు
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో నీటి కోసం పేదలు కటకటలాడుతున్నారు.బిందెడు నీళ్ల కోసం మున్సిపాలిటీ అధికారులు పంపించే అరాకొర నీళ్ల ట్యాంకులు సరిపోక శనివారం ఉదయం పట్టణంలోని 31వ వార్డు పోలీస్ క్వార్టర్స్ లైన్ లో నీటి కోసం పడిన తిప్పలు అన్నీ ఇన్ని కావు..ఈ క్రమంలో పోట్లాటలు జరుగుతున్నాయి. వేసవి కాలం కావడంతో ఉన్న బోరులో జలాలు అడుగంటి పోయాయి.దానికి పైపులు పెంచడమో లేదా మరలా బోరు లోతుగా వేయడమో చేసి నీటి సమస్యను తీర్చాల్సిన బాధ్యత గల పురపాలక సంఘ అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదు.ఆవార్డు ప్రజలు పలుమార్లు అధికారులను వేడుకుంటున్నా ఫలితం లేకుండా పోతుంది.దీంతో వారు పంపించే అరాకొర నీళ్ల ట్యాంకులు సరిపోక శనివారం ఉదయం ట్యాంకు వద్ద నీటి కోసం ప్రజలు నానా తిప్పలు పడ్డారు.ఇప్పటికైనా పురపాలక సంఘ అధికారులు స్పందించి నీటి సమస్యను పరిష్కరించాలని 30,31వార్డుల ప్రజలు కోరుతున్నారు.
Comment List