స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ బిందు మాధవ్
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 28 :పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లోని రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించిన- పల్నాడు జిల్లా ఎస్పీ బిందు మాధవ్.జి I.P.S.
మాచర్ల మండలం లోని సమస్యాత్మక గ్రామాలైన గన్నవరం,మతుకుమల్లి, కంభంపాడు,రాయవరం, జమ్మలమడుగు గ్రామాలలో గల పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించి అక్కడ భద్రతా ఏర్పాట్లు పరిశీలించి పోలీసు అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా అక్కడ ప్రజలతో మాట్లాడారు, గతంలో అక్కడ జరిగిన వివిధ సంఘటనల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఓటు హక్కు విలువలను గురించి వివరించారు. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎటువంటి అవాచక సంఘటనలకు పాల్పడినట్లు తెలిసిన యెడల కఠినమైన చర్యలు తీసుకొనడం జరుగుతుందని అన్నారు, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై 9440796184 నెంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comment List