జిల్లా లో ప్రతి ఇంటికి త్రాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.

జిల్లా లో ప్రతి ఇంటికి త్రాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా.

ఐ ఎన్ బి టైమ్స్ భద్రాద్రి కొత్తగూడెం మార్చి 27 : వేసవికాలంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా అధికారులను ఆదేశించారు. బుధవారం నాడు జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, మిషన్ భగీరథ ఈ ఈ , డి ఈ లు, పబ్లిక్ హెల్త్ డి ఈ లు,ఎంపీడీవోలు, ఎంపీలు, స్పెషల్ ఆఫీసర్లతో త్రాగునీరు  పనుల పురోగతిపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూనీటి ఎద్దటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి ప్రతి ఇంటికి నీరు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వేసవికాలంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని రాబోయే మూడు నెలల్లో గ్రామాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు అందించాలన్నారు. గ్రామంలో గల నీటి వసతులు అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలు హ్యాండ్ పంపులు, బోర్ వెల్స్,మిషన్ భగీరథ ద్వారా మంచినీటి సరఫరా కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. బోర్లు, హ్యాండ్, పంపులు మోటార్లు,  పైపుల లీకేజీల కు అవసరమైన మరమ్మత్తులను త్వరితగతిన  పూర్తిచేయాలని కలెక్టర్ అధికారులు ను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు  తమ పరిధిలోని అన్ని నీటి సరఫరా ప్రాంతాలను ప్రతిరోజు విధిగా తనిఖీ చేసి నివేదిక సమర్పించాల్సిందిగా  ఆదేశించారు. అవసరం ఉన్న చోట బోర్ వెల్స్ అద్దె  ప్రతిపాదికన ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ నీరు బల్క్ సప్లై సరిపోనియెడల సప్లై పెంచాలని మిషన్ భగీరథ అధికారులను ఆమె ఆదేశించారు.ఎస్ డి ఎఫ్ లో ప్రతిపాదించిన పనులను పురోగతిలో ఉన్నవి పూర్తి అయినవి,పూర్తి కావలసినవి, పట్టిక ద్వారా వివరాలను నమోదు చేసి నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పర్యటనలో భాగంగా అన్ని మండలాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తానని ఎటువంటి పొరపాట్లు లేకుండా ముందుగానే త్రాగునీటి సరఫరా పై జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా అధికారులకు ఆదేశించారు. ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ విద్యా చందన, మిషన్ భగీరథ ఈ ఈ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 14

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం