క్రికెట్ టోర్నీ విజేతలకు *ఆర్ ఆర్ ఆర్*చేతుల మీదుగా బహుమతుల ప్రదానం
On
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం ఏప్రిల్ 26: నగరంలోని 48వ డివిజన్ లో టీబీపీఎల్ క్రికెట్ టోర్నీ విజేతలకు కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి గురువారం రాత్రి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఓ మంచి క్రికెటర్ నేనని, కాలేజ్ సమయంలో బాగా ఆడేవాడినని, హెచ్ సీ ఏ లో ప్యాటరన్ గా చేశానని గుర్తుచేశారు. 36 టీములతో ఆడించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు మహమ్మద్ జావిద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, మాజీ కార్పొరేటర్ నాగండ్ల దీపక్ చౌదరి, నాయకులు యడ్లపల్లి సంతోష్, బోజెడ్ల సత్యనారాయణ, లక్ష్మీ, కొప్పుల చంద్రశేఖర రావు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, సయ్యద్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
Tags:
Views: 5
Latest News
అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
09 May 2024 20:16:10
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
Comment List