అనాధ శవానికి అంతిమ క్రియలు చేసిన గోవింద్ రెడ్డి
మనసున్న మెట్టు గోవిందరెడ్డి
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలో నీ స్వామి వివే కానంద చారిటబుల్ ట్రస్ట్ మాచర్ల వారి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మాచర్ల జెడ్పి గర్ల్స్ హై స్కూల్ పక్క గల్లీలో గల ఒక అనాధ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినట్లు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ మరియు శ్రీ రామకృష్ణ సేవ సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు .ఉచిత నారాయణ సేవలో భాగంగాఆ అనాధ మహిళకు కూడ మూడు పూటలా ఆహారం అందిస్తున్నారు . యధా ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం భోజనం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆమె చనిపోయి ఉండటాన్ని గమనించారు. ఆమె కు నా అను వారు ఎవరు లేక గత ఐదు సంవత్సరాల నుండి ఎండకు వానకు ఇబ్బంది పడుతూ అక్కడే జీవనం సాగిస్తూ ఉండేది. అయితే ఆమె అంత్యక్రియలకు ఎవరు ముందుకు రాకపోవడంతో మాచర్ల పట్టణ పోలీస్ వారి ఆదేశంతో స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఓబుల చేట్టి నాసరయ్య , గండ్రకోట శివ సుందర ప్రసాద్ , పమ్మి ప్రభాకర్ రెడ్డి లా సహాయంతో అంత్యక్రియలు నిర్వహించినట్లు మెట్టు గోవింద రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని చూసిన ఆ చుట్టుపక్కల ప్రజానీకం పట్టణ ప్రముఖులు వివిధ సేవాసమితిల సభ్యులు మరియు పట్టణ ప్రజలు స్వామి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వారి సేవలను అభినందించారు.
Comment List