బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన నాయకులు
ఐ ఎన్ బి టైమ్స్ గజ్వేల్ ఏప్రిల్ 24: కాంగ్రెస్ పార్టీలో చేరిన మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు గంగిశెట్టి రాజు,నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ, సిద్దిపేట జిల్లా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో బుదవారం కాంగ్రెస్ పార్టీలోకి బి ఆర్ ఎస్ శ్రేణులు బారీగా చేరారు.మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ నేతృత్వంలో వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ లో చేరారు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు గంగిశెట్టి రాజు, నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు భద్రయ్య,షరీఫ్, అజీజ్,శ్రీనివాస్, నక్క ఎగొండ, మోచే ప్రభాకర్, కదుల్ల రామరాజు,వెంకటయ్య, ఫనిధర్, మహేందర్ రెడ్డి మరియు వివిధ హోదాల్లో పనిచేసిన బి ఆర్ ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన నర్సారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అని బి ఆర్ ఎస్,బీజేపీ పార్టీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే ప్రభుత్వం అని రాబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న నీలం మధు గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి నాయిని యాదగిరి, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్,చారి, జగ్గయ్య గారి శేఖర్,సర్దార్ ఖాన్, మతీన్, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్న గారి రాజు,ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comment List