బీజేపీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావుకు కిషన్ రెడ్డి, విద్యాసాగర్ రావు అభినందనలు

బీజేపీ అభ్యర్ధి తాండ్ర వినోద్ రావుకు  కిషన్ రెడ్డి, విద్యాసాగర్ రావు అభినందనలు

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మార్చి 26:భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖమ్మం అభ్యర్థిగా ప్రకటించిన తాండ్ర వినోద్ రావు  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారిని  సోమవారం హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి  వినోద్ రావుగారిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేసారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం ఉందనీ, ఖమ్మంలో ఘన విజయంతో అయనను మరింత బలోపేతం చేయాలని కిషన్ రెడ్డి అన్నారు. నడ్డా, కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణాలో బీజేపీ ఎవరూ ఊహించని ఫలితాలు సాధిస్తుందని దృఢంగా నమ్ముతున్నట్లు వినోద్ రావు  తెలిపారు. ప్రజలకు విస్తృత సేవ చేసేలా తనకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు కృతఙ్ఞతలు తెలిపారు. బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ గవర్నర్ సీ హెచ్ విద్యాసాగర్ రావు ను కూడా వినోద్ రావు  మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రజాసేవలో నిమగ్నమైన వినోద్ రావు ఖమ్మం బరిలో ఘన విజయం సాధిస్తారన్న ఆశాభావాన్ని అయన వ్యక్తంచేశారు. వినోద్ రావు విజయం కోసం కృషి చేస్తాం. బీజేపీ జిల్లా  అధ్యక్షుడు గల్లా  పార్టీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించిన వినోద్ రావు  ఘన విజయం కోసం యావత్ బీజేపీ యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ  అన్నారు. "తెల్ల కాగితం లాంటి స్వచ్ఛమైన వ్యక్తిత్వం గల వినోద్ రావు గారిని అభ్యర్థిగా ఎంపిక చేయడం పట్ల ఆనందంగా ఉంది. వారి విజయం కోసం అందరం కలసికట్టుగా కృషి చేస్తాం. అయన ఖమ్మంలో విజయం సాధిస్తారన్న నమ్మకం మాకుంది," అని అయన పార్టీ కార్యాలయంలో హొలీ సంబరాల్లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.

Tags:
Views: 13

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం