పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మార్చి 26: పదో తరగతి పరీక్షల నిర్వహణను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రిక్కాబజార్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఇందిరానగర్ లలో ఏర్పాటుచేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించి, పరీక్షా సరళిని పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో వైద్య శిబిరం, త్రాగునీరు, కనీస మౌళిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించారు. ఎండల దృష్ట్యా వైద్య శిబిరం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడ పొరపాట్లకు తావివ్వకుండా నిబంధనల మేరకు పరీక్షల నిర్వహణ చేయాలన్నారు. మొబైల్ ఫోన్లు కేంద్రంలోకి అనుమతించవద్దని, విద్యార్ధులతోపాటు, సిబ్బందిని ప్రిస్కింగ్ చేపట్టి, తనిఖీ తర్వాతనే అనుమతించాలని ఆయన తెలిపారు. పరీక్షా కేంద్రం ప్రహారీ గోడ చుట్టూ భద్రతా సిబ్బంది పహారా కాయాలని, అప్రమత్తంగా వుంటూ, అన్ని భద్రతా చర్యలు చేపట్టాలన్నారు.  ఈ సందర్భంగా పరీక్షా కేంద్ర చీఫ్ సూపరింటెండెంట్, పోలీస్ అధికారులు, తదితరులు ఉన్నారు.

Tags:
Views: 5

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం జోరుగా గ్రామాలలో ఎన్నికల ప్రచారం
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ ప్రతినిధి మే 09 : మాచర్ల నియోజకవర్గం,మాచర్ల మండలం,కొత్తపల్లి, ద్వారకాపురి, రేగులవరం తండా, లచ్చంబాయి, అచ్చమ్మకుంట, సుబ్బారెడ్డి పాలెం,...
మాజీ ఎమ్మెల్యే కందాళకు బిగ్ షాక్..: కాంగ్రెస్ గూటికి కందాళ రైట్ హ్యాండ్ - బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన రాజుపేట ఎంపీటీసీ - కండువా కప్పి స్వాగతం పలికిన పొంగులేటి
రామ సహాయం రఘు రామ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ విసృతంగా ప్రచారం నిర్వహిస్తున్న
రఘురాంరెడ్డి గెలుపును ఏ శక్తి అడ్డుకోలేదు. రఘురాంరెడ్డి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి. మాతతత్వ, కార్పొరేట్ పార్టీకి తెలంగాణలో అడుగుపెట్టనీయం. బిఆర్ఎస్ కు ఓటేస్తే బిజెపికి వేసినట్లే.
తెలంగాణ ఉద్యమకారులకు అండగా ఉంటాం..
బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి