తలపాగా చుట్టి..డోలు వాయించి..

లోక్యాతండాలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి సందడి.బంజారాలతో కలిసి హోలీ.. కేళి

తలపాగా చుట్టి..డోలు వాయించి..

ఐ ఎన్ బి టైమ్స్ కూసుమంచి మార్చి 25: హోలీని పురస్కరించుకొని సాయం సంధ్య వేళ పిల్లలు..యువతీ యువకులు..మహిళలు..పెద్దలు ..అంతా ప్రధాన సెంటర్ లో గుమి గూడి ఉండగా..కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి అక్కడికి చేరుకొని ..వారిలో ఒ కరిగా మారి మరింత సందడి చేశారు. ఈ ఘటన కూసుమంచి మండలం లోక్యా తండాలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. హోలీ పండుగను పురస్కరించుకుని.. మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి తో కలిసి పొంగులేటి ప్రసాద్ రెడ్డి  లోక్యా తండాకు వెళ్లి.. వారితో మమేకమై.. ఆడి పాడి సందడి చేశారు.  గిరిజనులు వారి సంప్రదాయ సేవ్లాల్ పాకిడీ(తల పాగా) చుట్టారు. ఆ తర్వాత డోలు చేత బట్టి వాయించి మరింత ఉత్సాహం నింపారు. కోలాటం ఆడుతూ.. వారి సంప్రదాయ నృత్యంలో అడుగులేస్తూ.. హోలీ నీ ఆనందాల కేళి చేశారు. ఆ తర్వాత మాజీ ఎంపీపీ వడిత్యా తావూరియా, రాజుల నివాసాలకు వెళ్లి.. పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తుంబూరు దయాకర్ రెడ్డితో కలిసి పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఏళ్ల నాటి సంప్రదాయాలను కొనసాగిస్తూ.. అందరూ కలిసి ఈ హోలీని జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:
Views: 11

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి  బహుజన బిడ్డను ఆశీర్వదించండి... కత్తెర గుర్తుపై ఓటెయ్యండి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 08: ఖానాపురం హవేలీ నందు, పి. ఆర్ దేవి అధ్యక్షతన ఖమ్మం నియోజకవర్గం బి ఎల్ ఎఫ్ పార్టీ...
ఓటర్ల ఫిర్యాదులకు వెంటనే స్పందించి, పరిష్కరించాలి -- ఎక్స్పెండించర్ సెన్సిటివ్ జోన్లు, స్లమ్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
నేతల ఇళ్లకు వెళుతూ..సమావేశాలు నిర్వహిస్తూ.. * కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
మోదీది అరాచక పాలన * బీజేపీ కి ఓటేస్తే మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు *ఏఎస్సార్ ఆత్మీయ సమ్మేళనంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
కేసీఆర్ రుణం తీర్చుకునే సమయమిదే నిజానికి - అబద్దానికి మధ్య పోరులో నాదే విజయం రైతు బిడ్డ గెలుపు బాధ్యత అందరిది నా గెలుపుతోనే మళ్లీ జిల్లా కళకళ మళ్లీ గెలిస్తే పార్లమెంట్ లో గర్జిస్తా
రైతులకు ఎలాంటి కష్టం రానివ్వం
కాంగ్రెస్ రైతు పక్షపాత పార్టీ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం