వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి

అధికారులకు దిశా నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎ.మల్లిఖార్జున

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలి

ఐ ఎన్ బి టైమ్స్ విశాఖపట్నం, మార్చి 27 : జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లిఖార్జున సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఎక్కడా తాగునీటి కొరత లేకుండా అవసరమైన ముందస్తు ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. అలాగే తాగునీరు వృధా కాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం కలిగించాలని చెప్పారు.  కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో వేసవిలో తాగునీటి అవసరాల సన్నద్ధత అంశాలపై జీవిఎంసి కమిషనర్ సీఎం.సాయికాంత్ వర్మతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలో నీటి కొరత లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జీవీఎంసి, ఆర్.డబ్యూఎస్,నీటి వనరులు,పంచాయతీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. జిల్లా లో గత నవంబర్, డిసెంబర్ మాసాల్లో వర్షపాతం తక్కువగా నమోదైందని, అదే ఇంకా కొనసాగు తుందని తెలిపారు. కావున నీటి సౌలభ్యాన్ని ముందే అంచనా వేసుకొని, ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. తాగునీటి సమస్య లేకుండా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటిని సరఫరా చేయాలన్నారు. మంచినీటి బోర్లు, మోటార్లు, పైపులు, ట్యాపులు మరామ్మతులకు గురైతే తక్షణమే మరామ్మతులు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు వృధా కాకుండా నీటి వనరులు, వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. జీవీఎంసి కమిషనర్ సీఎం.సాయికాంత్ వర్మ మాట్లాడుతూ ఏలేరు, గోదావరి, గోస్తని, రాయపూడి, తాటిపూడి, మేహాద్రి గెడ్డ, గంభీరం, ముడసర్లోవ నుంచి తాగునీరు లభిస్తుందని అన్నారు. ఏలేరు నుంచి అధిక శాతం నీటిని విశాఖ సిటీ వరకు వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. కొన్నింటిలో నీటిసాంద్రత తక్కువగా ఉందని కలెక్టరుకు వివరించారు. ఇటువంటి పరిస్థితిల్లో ఏలేరు నుంచి మేహాద్రి గెడ్డకు పంపింగ్ ద్వారా నీటిని పంపించేలా తొలిసారి ప్రయత్నం చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 15 నుంచి జూలై వరకు ఈ ప్రయోగం చేయడం ద్వారా రోజుకు అదనంగా 50 క్యూసెక్కుల నీటిని విశాఖ ప్రజలు వినియోగించుకునే అవకాశం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్ కె.వి.వి.చౌదరి, జిల్లా పరిషత్ డెప్యూటీ సీఈఓ డి. సత్య నారాయణ, జీవిఎంసి వాటర్ సప్లై పర్యవేక్షక ఇంజినీర్ కె.వి.ఎన్ రవి, వాటర్ రీసోర్సెస్ పర్యవేక్షక ఇంజినీర్ కె. సూర్య కుమార్, జిల్లా పంచాయతీ అధికారి ఎం.వి.ఎ. శ్రీనివాసరావు,ఇతర విభాగాల ఇంజినీర్లు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 5

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

దేశంలోని తొలి ప్రయివేటు రైలు   --- వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది. దేశంలోని తొలి ప్రయివేటు రైలు --- వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది.
ఐ ఎన్ బి టైమ్స్ డెస్క్ హైదరాబాద్ మే 08 : కేరళలోని తిరువనంత పురం నుంచి గోవా వరకూ రాకపోకలు సాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్...
మూడో నెంబర్ "గుర్తుం"దా...! - సింగిల్ హ్యాండ్ కి ఓటు వేయండి - ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్
స్ట్రాంగ్ రూం ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
42వ డివిజన్ బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్
ప్రచారo లో దూకుడు పెంచుతున్న యరపతినేని