పల్స్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్ - 11 ఏళ్ల చిన్నారి కడుపులోంచి వెంట్రుకలు వెలికితీత

పల్స్ హాస్పిటల్ లో అరుదైన ఆపరేషన్   - 11 ఏళ్ల చిన్నారి కడుపులోంచి వెంట్రుకలు వెలికితీత

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, మార్చి, 27: నగరంలోని పల్స్ ఆసుపత్రిలో పదకొండేళ్ల చిన్నారికి అరుదైన ఆపరేషన్ నిర్వహించారు.   బాలిక కడుపులో నెలల తరబడి పేరుకుపోయి  సుమారు 25 సెంటీ మీటర్ల పొడవు, 10 సెంటీ మీటర్ల వెడల్పు తో జీర్ణాశయానికి అడ్డుగా ఉన్న వెంట్రుకలను తొలగించారు. ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ అన్వర్ తెలపిన మేరకు.. 11 ఏళ్ల అమ్మాయి శరణీ గత కొన్ని నెలలుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. పలు ఆసుపత్రులు తిరిగి చికిత్స తీసుకుంటున్నా.. నొప్పి మాత్రం తగ్గడం లేదు. దీంతో ఆ పాప తల్లిదండ్రులు తమ ఆసుపత్రికి రాగా.. తాను క్షుణ్ణంగా పరీక్షించి.. పాప వ్యక్తిగత వివరాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. అప్పుడప్పుడు పాప వెంట్రుకలు నోట్లో పెట్టుకుని నమలటం చూశామని చెప్పడంతో.. పరీక్షలు నిర్వహించగా.. జీర్ణకోశంలో అడ్డుందని గుర్తించాము.. వెంటనే తమ సహచర వైద్యుడు డాక్టర్ ఆనంద్ గౌడ్ పాప తల్లిదండ్రులకు పరిస్థితి వివరించి ఆపరేషన్ చేశారు. పాప కడుపులో దాదాపు 25  సె మి , పొడవు 10 సె మి వెడల్పు చొప్పున వెంట్రుకలు చుట్టుకుని ఆహారాన్ని లోనికి పోనీయకుండా.. అడ్డుగా ఉన్న వెంట్రుకలు తొలగించారు. ఇప్పుడు పాప ఆరోగ్యంగా ఉందని.. క్రమేపి కోలుకుంటున్నట్లు వెల్లడించారు. వెంట్రుకలు తినటం అనేది ఒక జబ్బు.. దీనిని ట్రైకోఫేజియా (Trichophagia) అంటారని డాక్టర్ అన్వర్ తెలిపారు. మానసిక సమస్యల కారణంగా ఈ జబ్బు వస్తుందని ఆయన పేర్కొన్నారు.  నెలల తరబడి కడుపులో వెంట్రుకలు పేరుకుపోవడాన్ని ట్రైకోబెజర్ (trichobezoar) అంటారని వివరించారు.

Tags:
Views: 11

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

కొత్తగూడెం అభివృద్ధి కావాలంటే బిజెపిని గెలిపించండి ఎయిర్ పోర్ట్ సహా భారీ పరిశ్రమలు తీసుకొస్తాo కొత్తగూడెం అభివృద్ధి కావాలంటే బిజెపిని గెలిపించండి ఎయిర్ పోర్ట్ సహా భారీ పరిశ్రమలు తీసుకొస్తాo
ఐ ఎన్ బి టైమ్స్ కొత్తగూడెం మే 08 : ప్రధాన మంత్రి మోడీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని అందులో కొత్తగూడెం, ఖమ్మం ఉండాలంటే...
దేశంలోని తొలి ప్రయివేటు రైలు --- వచ్చే నెల 4 నుంచి ప్రారంభం కానుంది.
మూడో నెంబర్ "గుర్తుం"దా...! - సింగిల్ హ్యాండ్ కి ఓటు వేయండి - ఆర్ఆర్ఆర్ ని గెలిపించండి - సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్
స్ట్రాంగ్ రూం ను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్ కుమార్ సింగ్
42వ డివిజన్ బి అర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ను సందర్శించిన పోలీస్ కమిషనర్