విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్

ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం, తల్లాడ మార్చి 27: విద్యార్థుల నమోదు పెరిగేలా ప్రణాళికాబద్ద కార్యాచరణ అమలుచేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తెలిపారు. బుధవారం కలెక్టర్, తల్లాడ మండలంలోని గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మల్సూర్ తాండ గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, మిట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలలు సందర్శించారు. పాఠశాలల్లో ఏర్పాటుచేయనున్న పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన తనిఖీ పిమ్మట, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో విద్యార్థుల నమోదు, ఉపాధ్యాయుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. నమోదు తక్కువగా ఉండడంతో వచ్చే విద్యా సంవత్సరంలో నమోదులు పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు, ఈ దిశగా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, నమ్మకం పెంచాలన్నారు.   ఈ సందర్భంగా కలెక్టర్ మల్సూర్ తాండ లోని మండల పరిషత్ ప్రాధమికొన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పిల్లలతో ముచ్చటించి వారిని ఉత్తేజ పరిచారు. మంచిగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. కలెక్టర్ తనిఖీ సందర్భంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లాడ మండల తహసీల్దార్ రవికుమార్, ఎంపిడివో చంద్రమౌళి, అధికారులు తదితరులు ఉన్నారు.

Tags:
Views: 5

About The Author

INB Picture

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ