ఇఫ్తార్ విందులో పాల్గొన్న పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న పొంగులేటి ప్రసాద్ రెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్ కూసుమంచి మార్చి 25: కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయం ఇన్చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఆదివారం రాత్రి కూసుమంచిలో ఏర్పాటు చేసిన ఇస్తారు విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు, ముస్లింలు ఆయనకు ఇమామి జామిన్ కట్టి, రుమాల్ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. నెల రోజులపాటు ఎంతో నిష్టతో జరుపుకునే ఈ ఉపవాస దీక్షల వల్ల అందరికీ ఆకలి దప్పుల విలువ తెలుస్తుందని అన్నారు.  విజయవంతంగా ఉపవాసాలన్నీ పూర్తి కావాలని ఆకాంక్షించారు. అనంతరం ముస్లింలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అంతకుముందు అహమధ్ అలీ నివాసానికి వెళ్లి.. ఖర్జూరం తినిపించి ఉపవాస దీక్ష విరమింప చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, పొంగులేటి అభిమానులు పాల్గొన్నారు.

Tags:
Views: 9

About The Author

Post Comment

Comment List

Advertisement

Latest News

అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
ఐ ఎన్ బి టైమ్స్ ఖమ్మం మే 09: తప్పుడు హామీలతో ప్రజల్ని మోసం చేసిన  అసమర్థ కాంగ్రెస్ కు బుద్ది చెప్పి, కారు గుర్తుపై ఓటు...
తల్లాడ మండలంలో రఘురాం రెడ్డి విస్తృత ప్రచారం
వినోద్ రావును గెలిపిస్తే ఖమ్మం అభివృద్ధి ఖాయం లూటీ చేసే కాంగ్రెస్ ను నమ్మవద్దు బస్తర్ మహారాజ్ కమలచంద్ర భంజ్ దేవ్
కూనంనేని సమక్షంలో 130 కుటుంబాలు సిపిఐలో చేరిక. --ప్రజాక్షేత్రంలో ఉండే పార్టీ సిపిఐనే. --పార్టీ శ్రేణులు భాద్యతాయుతంగా పనిచేయాలి. --సమస్యల పరిస్కారమే సిపిఐ అజెండా.
నా గెలుపు ముదిరాజుల అభివృద్ధి కి మలుపు
సూరంపాలెం వైసీపీకి చెందిన 40 మాదిగ దండోరా కుటుంబాలు టిడిపిలో చేరిక
బాధిత కుటుంబాలను ఆదుకోవాలి : సిపిఐ