ఇంగ్లండ్‌ నుంచి భారీగా బంగారం తరలింపు...

ఇంగ్లండ్‌ నుంచి భారీగా బంగారం తరలింపు...

ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 30:మన దేశానికి పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ పసిడిని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది. 1990లలో కొన్ని పరిస్థితుల కారణంగా తాకట్టు పెట్టిన ఈ బంగారాన్నిక్రమంగా దేశంలోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కీలక పరిణామం జరిగింది.కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ధన త్రయోదశి రోజున (మంగళవారం) ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ నుంచి ఏకంగా 102 టన్నుల బంగారాన్ని మన దేశానికి తరలించింది. ఈ బంగారు ఖజానా మొత్తం మనదే. 1990లలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు తాకట్టు పెట్టి రుణాలు సేకరించింది. అయితే భద్రతతో పాటు వేర్వేరు కారణాలతో బంగారాన్ని అక్కడే చాలా కాలం నిల్వ చేసింది. అయితే తాజాగా అత్యంత వ్యూహాత్మకంగా ఈ బంగారాన్ని క్రమక్రమంగా భారత్‌కు తరలిస్తోంది.తాజాగా మంగళవారం నాడు అనగా ధన త్రయోదశి రోజున 102 టన్నుల బంగారాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో భారత్‌కు తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక విమానాలను కూడా ఉపయోగించింది. తాజా తరలింపుతో కలుపుకొని మన దేశంలో బంగారం నిల్వలు 510.5 టన్నులకు చేరాయి. ఇంగ్లండ్‌లో దాచింది మొత్తం 855 టన్నులు కాగా మిగతా పసిడి ఆ బ్యాంక్‌లోనే ఉంది.అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులు మారిపోతుండడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బంగారాన్ని మన దేశంలోనే సురక్షితంగా దాచుకోవడం మంచిదని ఆర్బీఐ యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు కూడా ఇందుకు కారణంగా ఉంది. అందుకే క్రమంగా బంగారాన్ని తరలిస్తోంది. తరలింపు ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 2022 నుండి ఇప్పటివరకు మొత్తం 214 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తీసుకొచ్చింది. దీంతో స్వదేశంలో నిల్వ ఉన్న బంగారం నిల్వలు 510.5 టన్నులకు పెరిగాయి. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ఇంకా 324 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. మరి ఈ బంగారాన్ని కూడా ఆర్బీఐ ఎప్పుడు తరలిస్తుందో వేచిచూడాలి.

Ad
 

 

 

Tags:
Views: 23

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం