నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...

నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...

ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం గోకవరం మండలం తంటికొండ గ్రామానికి చెందిన కొవ్వాడ బాబురావు అనే వ్యక్తి తన ఇంటి వద్ద పెంచుకుంటున్న నాటు కోళ్లు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసినట్లు గోకవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలిపారు. తక్షణమే గోకవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చేపట్టి, నాటు కోళ్లు దొంగతనం చేసిన ఆవుల గోపి, కొత్తపల్లి రమేష్, పిల్లల సురేంద్ర మేడికొండ అనిల్ కుమార్ అనే నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు గోకవరం ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 30 వేల రూపాయలు విలువగల నాటు కోళ్లను స్వాధీనం చేసుకున్నామని, అనంతరం నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ మండల పరిధిలో ఎవరైనా ఇటువంటి దొంగతనాలకు పాల్పడినా, చట్ట వ్యతిరేక చర్యలకు దిగినా వారిపై కఠినంగా వ్యవహరించి, చట్టపరంగా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

Ad
 

Tags:
Views: 27

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న.. మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 8:మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 అండర్ 19 పోటీలో గెలుపొందిన యశస్విని ఘనంగా సన్మానించిన కూకట్పల్లి ఉమ్మడి...
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన
పశువులు మన సాంప్రదాయంలో భాగం
దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు – ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక