ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8:
మాచర్ల పట్టణ పరిధిలో చోటు చేసుకున్న ద్విచక్ర వాహనాల దొంగతనాల కేసులో మాచర్ల టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కీలక పురోగతి సాధించారు.ఈ ఘటనకు సంబంధించిన నిందితుడిని అరెస్ట్ చేసి,మొత్తం 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం,నెహ్రూనగర్ 2వ లైన్, 2వ వార్డు, మాచర్లకు చెందిన పఠాన్ రంజాన్ (33) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 2025 జనవరి 1 రాత్రి 10 గంటల నుంచి జనవరి 2 తెల్లవారుజామున 4 గంటల మధ్యలో ఫిర్యాదుదారుడి ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న హోండా యూనికోర్న్ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు,నెహ్రూనగర్కు చెందిన ఓర్సు దుర్గా రావు అలియాస్ బుగ్గలోడు (20) అనే యువకుడిని నిందితుడిగా గుర్తించారు.ఫిబ్రవరి 7న సాయంత్రం 7 గంటల సమయంలో నెహ్రూనగర్ ప్రాంతంలో అతడిని అరెస్ట్ చేశారు.నిందితుడి వద్ద నుంచి మొత్తం 9 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ టి.వెంకటరమణ తెలియజేశారు.
Comment List