పశువులు మన సాంప్రదాయంలో భాగం

ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

పశువులు మన సాంప్రదాయంలో భాగం

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8:పాడి పశువులు మన సాంప్రదాయంలో భాగమని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి తెలిపారు. ఆదివారం దుర్గి మండల కేంద్రంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి 72వ వార్షిక తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి ఎడ్ల పందేల‌ ప్రారంభోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.పోటీలో పాల్గొన్న ఎడ్ల యజమానులను పరిచయం చేసుకుని అభినందించారు.  ప్రత్యేక పూజలు నిర్వహించి పోటీలను ప్రారంభించారు.అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించాడు మాట్లాడుతూ...పశు సంపద వృద్ధి చెందినప్పుడే పంటలు బాగుంటాయని అభిప్రాయపడ్డారు. తిరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఏట ఎడ్ల పందేలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయటం పట్ల కమిటీ సభ్యులను    అభినందించారు.ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకుంటేనే భావితరాలు బాగుంటాయని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
Views: 11

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

తిరిగి వేడి చేయకూడని(re-heat) 7 ఆహారాలు! తిరిగి వేడి చేయకూడని(re-heat) 7 ఆహారాలు!
తిరిగి వేడి చేయకూడని(re-heat) 7 ఆహారాలు!
*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
నేను కేసీఆర్ మాదిరిగా విజయం సాధిస్తా..
తిరుపతిలో దొంగల బెడద..
పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..