ఇంగ్లండ్‌ నుంచి భారీగా బంగారం తరలింపు...

ఇంగ్లండ్‌ నుంచి భారీగా బంగారం తరలింపు...

ఐ ఎన్ బి టైమ్స్  అక్టోబర్ 30:మన దేశానికి పెద్ద ఎత్తున బంగారం నిల్వలు ఉన్నాయి. ఈ పసిడిని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ఆధీనంలో ఉంటుంది. 1990లలో కొన్ని పరిస్థితుల కారణంగా తాకట్టు పెట్టిన ఈ బంగారాన్నిక్రమంగా దేశంలోకి తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కీలక పరిణామం జరిగింది.కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ ధన త్రయోదశి రోజున (మంగళవారం) ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ నుంచి ఏకంగా 102 టన్నుల బంగారాన్ని మన దేశానికి తరలించింది. ఈ బంగారు ఖజానా మొత్తం మనదే. 1990లలో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు తాకట్టు పెట్టి రుణాలు సేకరించింది. అయితే భద్రతతో పాటు వేర్వేరు కారణాలతో బంగారాన్ని అక్కడే చాలా కాలం నిల్వ చేసింది. అయితే తాజాగా అత్యంత వ్యూహాత్మకంగా ఈ బంగారాన్ని క్రమక్రమంగా భారత్‌కు తరలిస్తోంది.తాజాగా మంగళవారం నాడు అనగా ధన త్రయోదశి రోజున 102 టన్నుల బంగారాన్ని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో భారత్‌కు తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక విమానాలను కూడా ఉపయోగించింది. తాజా తరలింపుతో కలుపుకొని మన దేశంలో బంగారం నిల్వలు 510.5 టన్నులకు చేరాయి. ఇంగ్లండ్‌లో దాచింది మొత్తం 855 టన్నులు కాగా మిగతా పసిడి ఆ బ్యాంక్‌లోనే ఉంది.అంతర్జాతీయంగా రాజకీయ పరిస్థితులు మారిపోతుండడం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బంగారాన్ని మన దేశంలోనే సురక్షితంగా దాచుకోవడం మంచిదని ఆర్బీఐ యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లు కూడా ఇందుకు కారణంగా ఉంది. అందుకే క్రమంగా బంగారాన్ని తరలిస్తోంది. తరలింపు ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 2022 నుండి ఇప్పటివరకు మొత్తం 214 టన్నుల బంగారాన్ని స్వదేశానికి తీసుకొచ్చింది. దీంతో స్వదేశంలో నిల్వ ఉన్న బంగారం నిల్వలు 510.5 టన్నులకు పెరిగాయి. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ఇంకా 324 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. మరి ఈ బంగారాన్ని కూడా ఆర్బీఐ ఎప్పుడు తరలిస్తుందో వేచిచూడాలి.

Ad
 

 

 

Tags:
Views: 44

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
  ఐ ఎన్ బి టైమ్స్ విజయవాడ మార్చి 22:ప్రస్తుతం ఎల్‌పీజీ వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన