అనారోగ్యంతో ప్రయాణికురాలు రైలులో మృతి బెంగాల్ వాసిగా గుర్తింపు
ఐ న్ బి టైమ్స్ ప్రతినిధి, సెప్టెంబర్6:అనారోగ్యంతో రైలులో ప్రయాణిస్తుండగా మహిళమృతి చెందిన సంఘటన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ లో శనివారం చోటుచేసుకుంది. వివరాలు మేరకు పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన మహిళా గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేదని, కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కొరకు చెన్నై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేందుకు వెళ్లడం జరిగిందని, వైద్య చికిత్స అనంతరం సొంత ఊరికి తిరిగి వెళుతుండగా తమిళనాడు నుండి ఝార్ఖండ్ వెళ్లే రైలు (జెస్సిద్, త్రివేండ్రం) లో మహిళ మృతి చెందిన సంఘటన జరిగింది మృతురాలు కుటుంబ సభ్యులు సూళ్లూరుపేట రైల్వే శాఖ అధికారులకు సమాచారాన్ని అందించడం జరిగింది. రైల్వే స్టేషన్ కు చేరుకున్న అధికారులు రైలును ఆపి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. రైలు ప్రయాణంలో మహిళా మృతి చెందడం ప్రయాణికులను తీవ్ర దిబ్భ్రాంతికి గురిచేసింది.
Comment List