రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ నాయకుని కుటుంబానికి ఆర్థిక సహాయం

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ నాయకుని కుటుంబానికి ఆర్థిక సహాయం

ఐఎన్ బి టైమ్స్, జనవరి 26, వెల్దుర్తి.:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి  మండలంలోని రచ్చ మల్లపాడు గ్రామానికి చెందిన జనసేన నాయకులు బేతం శెట్టి పెద్ద కొండలు గతేడాది రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ  రోజు వారి కుటుంబానికి నాదెండ్ల మనోహర్ చేతుల మీద 5 లక్షల రూపాయల చెక్కు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల జనసేన పార్టీ సమన్వయ కర్త బూసా రామాంజనేయులు, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులి హరి మరియు వెల్దుర్తి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గంధం మల్లయ్య, ఉపాధ్యక్షుడు తోట శ్రీను, గ్రామ అధ్యక్షుడు దండే రాజా, వాలంటీరు గుర్రాల మణి, చింతల మణి, రంగారావు, వెంకయ్య, అంజి పాల్గొన్నారు. గంధం మల్లయ్య మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ అని మరియు  పవన్ కళ్యాణ్ కార్యకర్తల మంచి కోరుకునే వ్యక్తి అని పేర్కొన్నారు. వెల్దుర్తి మండలంలోని ప్రతి జనసేన  కార్యకర్త జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు 

Ad
 

Tags:
Views: 42

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న.. మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 8:మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 అండర్ 19 పోటీలో గెలుపొందిన యశస్విని ఘనంగా సన్మానించిన కూకట్పల్లి ఉమ్మడి...
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన
పశువులు మన సాంప్రదాయంలో భాగం
దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు – ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక