సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చెక్కులు ఇచ్చేందుకు విజయవాడకు సినీ బృందం

 సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చెక్కులు ఇచ్చేందుకు విజయవాడకు సినీ బృందం

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:కనివిని ఎరుగని వర్షం ప్రభావంతో భారీ వరదలతో ఏపీలో అనేక గ్రామాలు జలమయం అయ్యాయని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సినీ బృందం చేరుకుంది. వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చేందుకు బాలయ్యతో పాటు జొన్నలగడ్డ సిద్ధు, విశ్వక్‌సేన విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలయ్య మాట్లాడుతూ.. ప్రాంతాలు వేరైనా మనది తెలుగు భాష అని అన్నారు. ఒక ప్రాంతానికి ఆపద వస్తే మరో ప్రాంతం సాయం చేసే విధంగా కుటుంబంలాగా పనిచేశారన్నారుఅందరినీ ప్రభావితం చేసి వాళ్ళని ఆదుకునే విధంగా జోలు పట్టి ఎన్టీఆర్ ప్రాంతాలన్నీ తిరిగేవాళ్లని గుర్తుచేశారు. వరద ముప్పుకు అందరూ స్పందించారన్నారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నా సరే రాష్ట్రం కోసం తమ వంతు సాయం చేశారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌‌కు చెక్కులు ఇవ్వడానికి విజయవాడ వచ్చామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రకటించి చేసి చాలా రోజులు అవుతుందన్నారు. కొంతమంది పేర్లు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదన్నారు. ఈ వరదని ప్రభుత్వం సృష్టించింది అని కొందరు వ్యక్తులు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితుల కోసం సాయం చేసిన వాళ్లందరికీ బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. విపత్తుల సమయంలో కేంద్ర ప్రభుత్వం బాగా స్పందించిందని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు.కాగా.. వరద బాధితులకు బాలయ్య, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన తమ వంతు సాయం అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు వీరు విరాళం ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించగా.. సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు.. విశ్వక్‌ సేన్‌ ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలను విరాళంగా ప్రకటించారు.

Tags:
Views: 12

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు... నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...
ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, అక్టోబర్ 30:నాటు కోళ్లు దొంగతనం చేసే దొంగలను గురువారం గోకవరం పోలీసులు పట్టుకున్నారు. గోకవరం ఎస్సై పవన్ కుమార్...
గోకవరం మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన... గోకవరంలో ముంపుకు గురైన పలు ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్..
మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు