సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చెక్కులు ఇచ్చేందుకు విజయవాడకు సినీ బృందం

 సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు చెక్కులు ఇచ్చేందుకు విజయవాడకు సినీ బృందం

ఐ ఎన్ బి టైమ్స్  సెప్టెంబర్ 12:కనివిని ఎరుగని వర్షం ప్రభావంతో భారీ వరదలతో ఏపీలో అనేక గ్రామాలు జలమయం అయ్యాయని హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గురువారం హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి సినీ బృందం చేరుకుంది. వరద బాధితుల కోసం ప్రకటించిన విరాళాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చేందుకు బాలయ్యతో పాటు జొన్నలగడ్డ సిద్ధు, విశ్వక్‌సేన విజయవాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలయ్య మాట్లాడుతూ.. ప్రాంతాలు వేరైనా మనది తెలుగు భాష అని అన్నారు. ఒక ప్రాంతానికి ఆపద వస్తే మరో ప్రాంతం సాయం చేసే విధంగా కుటుంబంలాగా పనిచేశారన్నారుఅందరినీ ప్రభావితం చేసి వాళ్ళని ఆదుకునే విధంగా జోలు పట్టి ఎన్టీఆర్ ప్రాంతాలన్నీ తిరిగేవాళ్లని గుర్తుచేశారు. వరద ముప్పుకు అందరూ స్పందించారన్నారు. షూటింగ్‌లో బిజీగా ఉన్నా సరే రాష్ట్రం కోసం తమ వంతు సాయం చేశారన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌‌కు చెక్కులు ఇవ్వడానికి విజయవాడ వచ్చామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రకటించి చేసి చాలా రోజులు అవుతుందన్నారు. కొంతమంది పేర్లు ఎత్తడం కూడా తనకు ఇష్టం లేదన్నారు. ఈ వరదని ప్రభుత్వం సృష్టించింది అని కొందరు వ్యక్తులు ఆరోపణ చేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితుల కోసం సాయం చేసిన వాళ్లందరికీ బాలయ్య ధన్యవాదాలు తెలిపారు. విపత్తుల సమయంలో కేంద్ర ప్రభుత్వం బాగా స్పందించిందని ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు.కాగా.. వరద బాధితులకు బాలయ్య, సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్‌సేన తమ వంతు సాయం అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు వీరు విరాళం ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ ఏపీకి రూ. 50 లక్షలు, తెలంగాణకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించగా.. సిద్ధు జొన్నలగడ్డ ఏపీకి రూ. 15 లక్షలు, తెలంగాణకు రూ. 15 లక్షలు.. విశ్వక్‌ సేన్‌ ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలను విరాళంగా ప్రకటించారు.

Tags:
Views: 4

Advertisement

Latest News

వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
ఐ ఎన్ బి టైమ్స్ నాయుడుపేట ప్రతినిధి జూలై 01: తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో యువజన విభాగం రాష్ట్ర స్థాయి సమావేశంలో భాగంగా వైసీపీ అధినేత...
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత
మహా న్యూస్ కార్యాలయం పై దాడిని ఖండించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
హాఫ్ సారీ ఫంక్షన్ లో చిన్నారి యాషికను ఆశీర్వదించిన జనసేన పార్టీ నాయకులు : ప్రేమ కుమార్ దంపతులు.
జై కిసాన్ అగ్రికల్చర్ ప్రైవేట్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతేక పూజలు 
SSC సప్లిమెంటరీలో ఉత్తీర్ణులకు సీపెట్ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికై అవకాశం
ఎప్పటికప్పుడు అభివృద్ధి పథకా స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నఎమ్మెల్యే.