రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ నాయకుని కుటుంబానికి ఆర్థిక సహాయం

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ నాయకుని కుటుంబానికి ఆర్థిక సహాయం

ఐఎన్ బి టైమ్స్, జనవరి 26, వెల్దుర్తి.:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి  మండలంలోని రచ్చ మల్లపాడు గ్రామానికి చెందిన జనసేన నాయకులు బేతం శెట్టి పెద్ద కొండలు గతేడాది రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ  రోజు వారి కుటుంబానికి నాదెండ్ల మనోహర్ చేతుల మీద 5 లక్షల రూపాయల చెక్కు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల జనసేన పార్టీ సమన్వయ కర్త బూసా రామాంజనేయులు, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులి హరి మరియు వెల్దుర్తి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గంధం మల్లయ్య, ఉపాధ్యక్షుడు తోట శ్రీను, గ్రామ అధ్యక్షుడు దండే రాజా, వాలంటీరు గుర్రాల మణి, చింతల మణి, రంగారావు, వెంకయ్య, అంజి పాల్గొన్నారు. గంధం మల్లయ్య మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ అని మరియు  పవన్ కళ్యాణ్ కార్యకర్తల మంచి కోరుకునే వ్యక్తి అని పేర్కొన్నారు. వెల్దుర్తి మండలంలోని ప్రతి జనసేన  కార్యకర్త జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు 

Ad
 

Tags:
Views: 12

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం