రాయవరం గ్రామ విద్యార్థిని శ్రీ విజయశ్రీ సాయి తేజస్విని ప్రతిభ అవార్డుకు ఎంపిక
కలెక్టర్ గారి చేతుల మీదగా ప్రతిభ అవార్డుకు ఎంపిక.
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి జూన్ 06 :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డు సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణంలోని నారాయణ స్కూల్లో చదువుతున్న రాయవరం గ్రామ విద్యార్థిని నాగేండ్ల విజయశ్రీ సాయి తేజస్విని తండ్రి నాగిండ్ల వెంకటేశ్వర్లు తల్లి పిచ్చమ్మ , తేజస్విని పదో తరగతి ఉత్తీర్ణతలో 600 గాను 587 మార్కులు సాధించి ప్రతిభా అవార్డుకు కలెక్టర్ అనుమతితో ఎంపిక చేశారు మాచర్ల మండలం విద్యాశాఖ అధికారి అయినా అల్లి సురేష్ ఆధ్వర్యంలో నారాయణ హైస్కూల్లో విజయశ్రీ సాయి తేజస్విని నీ సన్మానించడం జరిగినది. ఈ సమావేశ అధ్యక్షులు ప్రిన్సిపాల్ పుల్లారెడ్డి , ఏజీ ఎం, లక్ష్మన రెడ్డి,వారి స్టాఫ్ మరియు రాయవరం గ్రామ నాయకులు కూని శెట్టి రామకృష్ణ , నాగేండ్ల దశరథ రాము , జగడాల శ్రీనివాసరావు, సర్పంచ్ పెండ్లి వెంకట కుమారీ, పాల్గొన్నారు . వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ అమ్మాయి మంచి చదువు చదువుతూ భవిష్యత్తులో ప్రతిభవంతురాలుగా ఎదగాలని ప్రజలకు తోడ్పడాలని కోరుచున్నాము.
Comment List