పోలేపల్లి లో గర్జన—మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు కొవ్వొత్తుల మహా నిరసన
ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01:పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారన్న ఆరోపణలతో ప్రజలు,పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్న నినాదాలతో గ్రామమంతా వెలుగుల ర్యాలీగా మారి నిరసన గళం మార్మోగింది.గ్రామ ప్రధాన వీధుల గుండా వందలాది మంది చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని శాంతియుతంగా సాగిన ఈ నిరసనలో మహిళలు,యువకులు,వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజకీయ కక్ష సాధింపుతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని వారు ఆరోపించారు.ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిని అణిచివేయాలనే ప్రయత్నం ప్రజలు ఎప్పటికీ సహించరని హెచ్చరించారు.ఈ సందర్భంగా పోలేపల్లి సర్పంచ్ బుసిరెడ్డి సాగర్ రెడ్డి మాట్లాడుతూ...“పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేదల గుండెల్లో స్థానం సంపాదించిన ప్రజానాయకుడు.ఆయనపై అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడి.ఇలాంటి చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేసి ఆయన్ను బేషరతుగా విడుదల చేయాలి”అని డిమాండ్ చేశారు.నిరసన సందర్భంగా గ్రామంలో న్యాయానికి మద్దతుగా నినాదాలు మార్మోగాయి.“అక్రమ అరెస్టులు నిలిపివేయాలి”,“ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి”, “పిన్నెల్లికి న్యాయం చేయాలి”అంటూ ప్రజలు గళమెత్తారు.ఈ కార్యక్రమం మొత్తం శాంతియుతంగా కొనసాగింది.పోలేపల్లిలో జరిగిన ఈ కొవ్వొత్తుల మహా నిరసన ప్రజల్లో న్యాయంపై ఉన్న నమ్మకాన్ని,ప్రజానాయకుడిపై ఉన్న ఆదరణను స్పష్టంగా చూపించింది. మాజీ ఎమ్మెల్యే అరెస్టుపై ప్రజల్లోనెలకొన్నఅసంతృప్తిరోజురోజుకుఉద్ధృతమవుతుండగా,ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్న స్వరం బలంగావినిపిస్తోంది.



Comment List