వైజాగ్ లో అర్ధరాత్రి యాసిడ్ కలకలం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై యాసిడ్ దాడి...

వైజాగ్ లో అర్ధరాత్రి యాసిడ్ కలకలం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై యాసిడ్ దాడి...


 ఐ ఎన్ బి న్యూస్ వైజాగ్ నవంబర్ 30 :ఆర్టీసీ బస్సులో తమ గమ్యస్థానాలకు వెళ్తున్న మహిళలపై అనూహ్యంగా దూసుకొచ్చిన ఓ దుండగుడు యాసిడ్‌ విసిరాడు. ఆ వెంటనే బస్సులో నుంచి దూకి పరారయ్యాడు.ఏం జరిగిందో తెలిసేలోపు యాసిడ్‌ దాడితో తీవ్ర గాయాలపాలయ్యారు. యాసిడ్‌ మంటలకు తాళలేక కేకలు వేయడంతో వెంటనే స్థానికులు స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన రాత్రిపూట విశాఖపట్టణంలో కలకలం రేపింది. పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.విశాఖపట్టణంలోని కంచరపాలెం ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను చల్లాడు. యాసిడ్‌ దాడితో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వెంటనే ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ బస్సును నిలిపివేశారు. దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే అతడు పారిపోయాడు. యాసిడ్‌ దాడితో కళ్లు మండుతుండడంతో మహిళలను వెంటనే స్థానికులు ఆటోలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు

Tags:
Views: 17

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత