కొప్పాయి పాలెం చెరువులో మట్టి దొంగలు పడ్డారు... అధికారులు ఏమయ్యారు...?

కొప్పాయి పాలెం చెరువులో మట్టి దొంగలు పడ్డారు... అధికారులు ఏమయ్యారు...?

 

Ad
 ఐ ఎన్ బి టైమ్స్ వెంకటగిరి, జులై 13 : అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరుతున్న అరికట్టాల్సిన అధికార యంత్రాంగం ఏమయ్యారని మండల ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. పట్ట  పగలే డక్కిలి మండల పరిధిలోని కొప్పాయిపాలెం చెరువులో మట్టి దొంగలు పడి టన్నులకొద్దీ మట్టిని భారీ యంత్రాలతో తరలించకపోతున్న రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. చదునుగా ఉన్న చెరువును భారీ యంత్రాలతో తవ్వేసి గుంతల మయం చేసేసి, మట్టితో వ్యాపారం సాగించి లక్షల గడిస్తున్నారు. చదునుగా ఉన్న చెరువులను భారీ యంత్రాలతో బావులుగా మార్చడం, వర్షాకాలం నీరు చేరి ఆ గుంతల్లో ఆదమరిచి పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నేడు మట్టి మాఫియా జోరుగా సాగుతుంది. మేము అధికార పార్టీ నాయకులం, ఎమ్మెల్యే అనుచరులం అంటూ మట్టి

 తరలింపు సాగిస్తున్నారు. రోజు రోజుకు అక్రమ వ్యాపారాల దందా అధికమవుతున్న ఏ ప్రభుత్వ అధికారి చర్యలు చేపట్టక చూసి చూడనట్లు వ్యవహరించడంతో అక్రమ వ్యాపారాలు ఊ పందుకుంటున్నాయి. గ్రామంలో ఎవరైనా ఇంటి అవసరాలకు మట్టి తవ్వకాలు చేపట్టాలనుకుంటే వారిపై చర్యలు తీసుకుంటున్నారు కానీ, వ్యాపారంగా చెరువు మట్టిని తరలించకపోతున్న మట్టి దొంగలను కట్టడి చేయలేకపోతున్నారు. దీని వెనుక రాజకీయ పార్టీ నేతల అండదండలు ఉన్నాయా! రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వారి ప్రలోభాలకు లోనయ్యారా అనేది కూడా ఓ కోణంలో చర్చించుకుంటున్నారు. సంబంధిత జిల్లా అధికారులు చర్యలు చేపట్టి చదునుగా ఉన్న చెరువులను కాపాడాలని ఆ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Tags:
Views: 62

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
  ఐ ఎన్ బి టైమ్స్ విజయవాడ మార్చి 22:ప్రస్తుతం ఎల్‌పీజీ వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన