టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ ఎర్రచందనం దొంగలు 

టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ ఎర్రచందనం దొంగలు 

 ఐ ఎన్ బి టైమ్స్ నెల్లూరు, జూలై 15 :

Ad
* రూ. 50లక్షల విలువైన 192 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

* అక్రమ రవాణాకు అనువుగా రీఫర్లు, పలకలు గా మార్చివేత

* నెల్లూరు జిల్లా చేజర్ల వద్ద ఘటన

* కారు, మోటారు సైకిల్ స్వాధీనం

*నలుగురు స్మగ్లర్లు అరెస్టు

నెల్లూరు జిల్లా చేజర్ల అటవీ ప్రాంతంలో అక్రమ రవాణా కు అనుకూలంగా రీఫర్లు, పలకలు గా మార్చిన ఎర్రచందనం, ఇంకా దూలాలు, దుంగలు కలిపి 192 ఎర్రచందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారు ఉపయోగించిన కారు, మోటారు సైకిల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ హెడ్ శ్రీ ఏల్.  సుబ్బారాయుడు గారి ప్రత్యేక కార్యాచరణలో భాగంగా, టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీ పీ.  శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ శ్రీ జి. బాలిరెడ్డి మార్గ నిర్దేశకత్వంలో ఆర్ఐ సాయి గిరిధర్ కు చెందిన ఆర్ఎస్ఐ లింగాధర్ టీమ్, స్థానిక ఎఫ్ బీఓ ఐ జనార్దన్ తో కలసి సోమవారం నుంచి నెల్లూరు జిల్లా చేజర్ల అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. మంగళవారం తెల్లవారుజామున వీరు కలువాయి ఫారెస్ట్ బీటు పరిధి చేరుకోగా, అక్కడ ఒక కారు, ఒక మోటారు సైకిల్ తో కొంతమంది గుమికూడి కనిపించారు. వారిని హెచ్చరించి చుట్టుముట్టే లోపు పారిపోసాగారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురిని పట్టుకున్నారు  వీరిలో ఇద్దరిని తమిళనాడు వాసులుగాను మరో ఇద్దరిని నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించారు.  కారులో లోడ్ చేసిన ఎర్రచందనం తో పాటు సమీపంలో దాచి ఉంచిన వాటితో సహా 192 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 50 లక్షలు గా అంచనా చేశారు. వారిని తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించగా డీఎస్పీలు శ్రీనివాస రెడ్డి, షరీఫ్ లు విచారించారు. ఎస్ ఐ రఫీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Tags:
Views: 13

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం